Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిదండ్రుల రోదన
- ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన ఘటన ఘట్కేసర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామానికి చెందిన గుండ్ల లింగం కూతురు ఐశ్వర్య(9) ఉదయం వాంతులు మోషన్స్ అవుతున్నాయని మండల కేంద్రంలోని అమృత సాయి ఆస్పత్రికి తీసుకోచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్లు కోజులు, ఇంజక్షన్లు ఇస్తు చికిత్స చేశారు. రాత్రి 8 గంటలకు గ్లుకోజ్ అయిపోవడంతో ఒక్క సారి స్వాస వదిలిందని, డాక్టర్ గ్లుకోజ్ తీసి ఉప్పల్ డిపొవద్ద స్పార్క్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని పంపించారు. అక్కడికి వెళ్లాగానే వైద్యులు చిన్నారిని పరీక్షించి మృతిచెందినట్టు నిర్దారించారు. చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నారిని తీసుకోచ్చి అమృత ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన విరమించాలని సూచించారు. ఈ విషయంపై ఏలాంటి ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు అందితే విచారించి బాధ్యులను చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రఘువీరారెడ్డి తెలిపారు.
వాంతులు, మోషన్స్ అవుతున్నాయని ఆస్పత్రికి తీసుకోచ్చా..
ఉదయం వాంతులు మోషన్లు అవుతున్నాయని అమృత ఆస్పత్రికి తీసుకోచ్చాం. డాక్టర్లు పాపకు గ్లుకోజ్లు ఎక్కించారు. ఇంజక్షన్లు ఇచ్చారు. సాయంత్రం 7:50 నిమిషాల సమయంలో గ్లుకోజ్ తీయగానే శ్వాస వదిలింది. అప్పుడు డాక్టర్లు స్పార్కు ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నారు. అక్కడికి తీసుకెళ్లాం. కానీ పాప అప్పటికే మృతిచెందినట్టు వారు తెలిపారు.