Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమీర్పేట
భరత్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఈ నెల 11న 5నెలల పసిపాపను వదిలేసిన కన్నతల్లిని అరెస్టు చేసిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నవరానికి చెందిన శివగంగా భవాని సవుద్దిన్ అనే యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత కొంత కాలంగా చింతల్లో నివాసం ఉంటూ, రైల్వే స్టేషన్లలో బ్యాగులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఐదు నెలల క్రితం పాప పుట్టగానే భర్త సవుద్దిన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ భారం మీద పడటంతో భవాని దిక్కుతోచని స్థితిలో పాపను భరత్నగర్ రైల్వే స్టేషన్లో వదిలివెళ్లిందని, స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని గంగాభవానిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.