Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నారాయణగూడ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య (రైతు) పై అక్రమంగా హత్యకేసును బనాయించారని హైకోర్టు అడ్వకేట్ పి.లలిత కామేష్, మానవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎడం బాలాజీలు అన్నారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమేవేశంలో వారు మాట్లాడుతూ దుర్గం రాజయ్యపై హత్యకేసుతో పాటు పలు దొంగతనాలు, దోపిడి చేశాడని పోలీసులు జైలుకు పంపారని వారు ఆరోపించారు. రాజయ్యకు తమ బాబాయి అయిన లచ్చయ్య భార్య దుర్గం మల్లక్క హత్యకు ఆయనకు ఎలాంటి సంబంధం లేకున్నా పోలీసులు కేసు నమోదు చేశారని వారు తెలిపారు. రాజయ్యకు తమ గ్రామంలో 8 ఎకరాల మామిడి తోట, 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అట్టి భూమిని సాగు చేసుకుంటేనే జీవితం కొనసాగుతుందని వారు అన్నారు. రాజయ్యకు ఆ గ్రామంలో ప్రాణభయం ఉందని, వెంటనే ఆయనకు పోలీస్ రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాజయ్యపై ఎలాంటి రౌడీ షీట్ ఓపెన్ చేయలేదని హైకోర్టు స్పష్టం చేసిందని వారు తెలియజేశారు.