Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇండియాలో లెర్న్ గోల్ఫ్ వీక్(ఐఎల్జిడబ్య్లూ) తన రెండవ ఎడిషన్ను ప్రారంభిస్తోంది. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీవరకు తన రెండవ ఎడిషన్ కొనసాగనుందని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలోని 26 నగరాల నుంచి దాదాపు 51కిపైగా క్లబ్లు పాల్గొంటాయన్నారు. గోల్ఫ్ ఇండిస్టీ అసోసియేషన్(జీఐఎ) ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 2022నాటికి లక్ష మంది కొత్త గోల్ఫ్ ఆటగాళ్లను పరిచయం చేస్తామన్నారు. ఇందుకుగాను ఐఎల్జీడబ్య్లు గోల్ఫ్ ఆటకు చెందిన గగన్జీత్ బుల్లార్తోపాటు పమిల్ గంగ్జీ వంటి స్టార్ ఆగటాళ్లతోపాటు ఇతర అసోసియేషన్ల్ మద్దతు తీసుకుంటున్నామన్నారు. గతేడాది ప్రారంభించిన క్రీడలో 15 నగరాల నుంచి 27 క్లబ్లకు చెందిన 7వేల మంది ఆటగాళ్లు పాల్గొన్నాయని గుర్తు చేశారు. గోల్ఫ్ ఆటలో ఛాంపియన్లను వెలికి తీసేందుకే ఈ క్రీడను నిర్వహిస్తున్నామన్నారు.