Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఆపద్ధర్మ మంత్రి పద్మారావుగౌడ్
నవతెలంగాణ-అడ్డగుట్ట
సికింద్రాబాద్ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని మంత్రి పద్మారావుగౌడ్ టీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సికింద్రాబాద్లోని తన కార్యాలయంలో సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్స్ సామల హేమ రూపొందించిన ఎన్నికల కరపత్రాలు, ప్రచార సామగ్రిని పద్మారావుగౌడ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న శక్తులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధిని అడ్డుకొనేందుకు ఒక్కటౌతున్నాయని ఆయన విమర్శించారు. 50 ఏండ్లలో చేపట్టలేని అభివృద్ధి పనులను కేవలం నాలుగేండ్లలోనే చేపట్టామని తెలిపారు. ప్రజల సంక్షేమానికి చిత్త శుద్దితో కషి చేశామన్నారు. సికింద్రాబాద్ ప్రజలు తమని దీవిస్తారనే విశ్వాసం ఉందని భరోసా వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో ఆలకుంట సరస్వతి, విజయకుమారి, భార్గవి, ధనజన పాల్గొన్నారు.