Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ దత్తాత్రేయ
నవతెలంగాణ - బేగంపేట
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ దత్తాత్రేయ దిశానిర్దేశం చేశారు. గురువారం బన్సీలాల్పేట డివిజన్లోని బోయగూడలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అన్ని మాటలు చెప్పి నీటి మూటలుగానే మార్చిందని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. అనంతరం సనత్నగర్ జాయింట్ కన్వీనర్గా శీలం శివలింగంను ఎన్నిక చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో బన్వర్లాల్వర్మ, శ్యాంసుందర్గౌడ్, రాంచందర్రావు, యాదిగిరి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.