Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
రాబోయే ఆరు నెలల్లో 15 నగరాల్లో రెండో ఎస్బీఐ గ్రీన్ మారథాన్ నిర్వహించనున్నామని ఎస్బీఐ డీఎండీ, సీఎఫ్ఓ అండ్ సీడీఓ ప్రశాంత్కుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో అక్టోబర్ 21న ఎస్బీఐ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నుందన్నారు. రన్ఫర్ గ్రీనర్ ఫ్యూచర్ నేపథ్యంతో మారథాన్ను 15 నగరాల్లో 75వేల మందితో నిర్వహించనున్నట్టు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీకి ప్రచారం కల్పించడంలో భాగంగా ఆర్గానిక్ టీ-షర్ట్స్ను అందించనున్నట్టు, రన్నర్స్ బిబ్లో ఉండే విత్తనాలను మారథాన్ ముగిసిన తర్వాత నాటుతామన్నారు.