Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఆపద్ధర్మ మంత్రి తీగుళ్ల పద్మారావుగౌడ్
నవతెలంగాణ - అడ్డగుట్ట
ఇప్పటికే అభివృద్ధి పధంలో పయనిస్తున్న సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మరిన్ని నిధులు మంజురయ్యాయని ఆపద్ధర్మ మంత్రి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. గురువారం నామాలగుండులోని తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గం పలు అభివృద్ధి పనులకు రూ.25 కోట్ల మేరకు ప్రత్యెక నిధులు మంజురైనట్టు తెలిపారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ ఇప్పటికే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నాలుగేండ్లలో అభివృద్ధి పనులకు రూ.450 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలో తాజాగా జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులకు రూ.5.5 కోట్లు, జల మండలి ద్వారా అభివృద్ధి పనులకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు మంజురయ్యయని తెలిపారు. వాటికి అదనంగా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఐదు డివిజన్ల పరిధిలో విద్యుత్ స్థంభాల మార్పిడి, ప్రాణాంతకంగా ఉన్న కేబుల్స్ తొలగించి భూగర్భ కేబుల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారన్నారు.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
నార్త్ లాలాగూడ సమీపంలో ఈద్గా అభివృద్ధికి కొత్తగా మదర్సా భవనానికి రూ. రెండు కోట్ల మేరకు నిధులను మంజూరు చేసినట్టు ఆపద్ధర్మ మంత్రి తెలిపారు. అదే విధంగా షాదీఖానా నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేశారన్నారు. తాజాగా మంజూరు చేసిన నిధులకు సంబంధించిన పనలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ రవికుమార్, కార్పొరేటర్లు ఆలకుంట సరస్వతి, సామల హేమ, విజయకుమారి, భార్గవి, ధనుంజనగౌడ్, జలమండలి జీఎం రాజశేఖర్, ట్రాన్స్కో ఏడీఈ బాలునాయక్, అధికారులు కష్ణ, స్వప్న, స్వరూప, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.