Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసయ్యద్ అక్బర్ హుస్సెన్
నవతెలంగాణ- ధూల్పేట్
స్టీచ్చింగ్లో మైనార్టీలు రాణించేందుకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మెనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ అక్బర్ హుస్సెన్ అన్నారు. జాహనుమాలోని సెయింట్ మార్క్స్ బార్సుటౌన్ హై స్కూల్లో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ట్రైనీంగ్ అండ్ ప్రొటెక్షన్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విద్య, నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారిత కార్యక్రమాలను చేపట్టామన్నారు. మైనార్టీలకు స్టీచ్చింగ్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు బార్సుటౌన్ ఐటీసీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పాటు వస్తువుల ఉత్పత్తి బార్సుటౌన్ డైరెక్టర్ బ్రదర్ సీఏ థామస్, ప్రిన్సిపల్ బ్రదర్స్ షో రెడ్డితో పాటు ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వహీద్ పాల్గొన్నారు.