Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటీఎస్యూఈఈయూ కార్యదర్శి మహేందర్
నవతెలంగాణ- ధూల్పేట్
కాంట్రాక్ట్ ఔట్, సోర్సింగ్లో పనిచేస్తున్న విద్యుత్ కార్మిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ టీఎస్యూ ఈఈయూ (సీఐటీయూ) పోరాటాల ఫలితమేనని యూనియన్ కార్యదర్శి కే మహేందర్ అన్నారు. ఆర్టీజన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బేగంబజార్ డీఈ కార్యాలయంలో డీఈతో కలిసి కార్మిక ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఈ పరిధిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న సుమారు 230 మంది కార్మికులు రెగ్యూలరైజ్ కానున్నారని తెలిపారు. వీరిని వెంటనే భర్తీ చేయాలని, అర్హత కల్గిన వారికి ఉద్యోగో న్నతులు కల్పించాలన్నారు. అదేవిధంగా అన్ని రకాల అలవెన్సులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యుత్ కార్మిక యూనియన్ నాయకులు గోవర్దన్, ఎంవీ క్రిష్ణరెడ్డి, ల×నారాయణ, మున్నాలాల్నాయక్, కార్మిక ఉద్యోగులు పాల్గొన్నారు.