Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అంబర్పేట
ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆలేరు నియోజకవర్గం మందనపల్లి గ్రామానికి చెందిన డొప్ప అంజయ్య ముదిరాజ్ నియమితులైనట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి యాదగిరి ముదిరాజ్ తెలిపారు. గురువారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో అంజయ్యకు నియామక పత్రాన్ని యాదగిరి అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్లకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంజయ్య మాట్లాడుతూ ముదిరాజ్ల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. తెలంగాణలో అన్ని జిల్లాలలో విస్తృతంగా పర్యటించి సభ్యత్వాలు చేపట్టి సంఘం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం సంఘం అధ్యక్షుడు అనుమతితో యాదాద్రి జిల్లా నుంచి సభ్యత్వాలు ప్రారంభించి మండల, జిల్లాల కమిటీలు వేసి సంఘం పటిష్టం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నవీన్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బాలరాజ్ ముదిరాజ్, రాష్ట్ర సంఘటిత కార్యదర్శి నర్సింహులు ముదిరాజ్, గ్రేటర్ యువజన అధ్యక్షులు నర్సింగ్రావు ముదిరాజ్ పాల్గొన్నారు.