Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ సీనియర్ నాయకులు ధనుంజయ
నవతెలంగాణ-అంబర్పేట
రానున్న ఎన్నికల్లో అంబర్పేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్జీఎస్ ధనుంజయ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆదేశాల మేరకు గురువారం గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి బోసురాజును కలిసి ఆయన తన బయోడేటాను, ధరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి తనకు టికెటు కేటాయించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. తను రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్లో క్రీయాశీల కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్కు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు.