Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఎ.ఎస్.రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షులు ఎం. అంజన్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ పరిశీలకులు బోస్ రాజు సమక్షంలో ఆయ నకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎ.ఎస్.రావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవు తుందని, అందుకే ఈ పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే టీఆర్ఎస్లో చేరినట్టు చెప్పారు. ఆ పార్టీలో ఉద్యమంలో పని చేసిన వారికి గౌరవం లేదని చెప్పారు. కార్వాన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్కుమార్, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.