Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
నేడు యాదగిరిగుట్టలో నిర్వహించే అఖిల భారతీయ శ్రీ బట్ట బ్రాహ్మణ మహాసభ, తెలం గాణ రాష్ట్ర భట్రాజుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మహాసభ కేంద్ర కమిటీ అధ్యక్షులు మహేశ్ ప్రసాద్ శర్మ, తెలం గాణ అధ్యక్షులు అంబటి బాపురాజులు కోరారు. గురువారం బాగ్అంబర్పేట డివిజన్ లోని కార్యాలయంలో వారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న మయూరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహి స్తున్నట్టు తెలిపారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిలుగా మాజీ రాజ్యసభ సభ్యులు వి.హన్మంత్రావు, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేం దర్రెడ్డి, ఆర్.కృష్ణయ్య, జి.కిషన్రెడ్డి, ఫైళ్ల శేఖర్రెడ్డి, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్లతో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు హాజర్కానున్నట్టు తెలిపారు. అనంతరం చెన్న మాధవుని ప్రభాకర్రాజు సప్తసాగర శతక రత్నాలు గ్రంథా విష్కరణ కూడా ఉందన్నారు. ఈ కార్య క్రమంలో మహాసభ ఉపాధ్యక్షులు డాక్టర్ సి.వి.జైవీర్రాజు, కోశాధికారి అశోక్ కుమార్ శర్మ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దినేష్భట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.వై. గిరిరాజు, ఉపాధ్యక్షులు సి.ఎం.నవీన్రాజు, బొల్లెపల్లి నర్సరాజు, శ్రీనివాసరాజు, బిరుదరాజు సత్యం రాజు, ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ మూర్తిరాజు పాల్గొన్నారు.