Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేపీహెచ్బీ
వ్యాపారులు శుభ్రతను పాటించి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని ఆపద్ధర్మ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం కూకట్పల్లిలో నిర్వహకులు ఏర్పాటుచేసిన కాకినాడ సుబ్బయ్య హోటల్ను మాజీ ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ కావ్యారెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. రుచి, శుచికరమైన ఆహార పదార్థలను అందించినఫ్పుడే వినియోగదారులు ఆసక్తి చూపుతారన్నారు. కాకినాడలో సాధించిన పేరు ప్రఖ్యాతులు పొందేందుకు వినియోగదారులను పెంచుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు మంచి రుచికరమైన భోజనం సుబ్బయ్య హోటల్ల్లోనే దొరుకుతందనే విధంగా వంటకాలను తయారు చేయాలన్నారు.