Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణా - జూబ్లీహిల్స్
ఎర్రగడ్డలో నిన్న జరిగిన ప్రేమికులపై దాడి పూర్తిగా కులదురహంకారంతోనే జరిగిందని, ఈ విషయం పోలీసుల విచారణలో రుజువైనదని, దీనిని ఖండిస్తూ, బోరబండ సీపీఐ(ఎం) నాయకులు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా టి.సాయి శేషగిరిరావు మాట్లాడుతూ దళితులు ప్రేమించడం తప్పా అని ప్రశ్నించారు. మిర్యాలగూడలో ప్రణరు దళితుడైనందునే అమ్మాయి తండ్రే హత్యచేయించాడని, నిన్న ఎర్రగడ్డలో దళితుడైన సందీప్పై అమ్మాయి తండ్రే పట్టపగలు, నడిరోడ్డుపై హత్యచేయడం క్షమించరాని నేరమని అన్నారు. అసలు పోలీసు వ్యవస్థ అన్నా, న్యాయస్థానాలు అన్నా, భయంలేదని అందుకే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వెంటనే చట్టాలు మార్చి, ప్రేమికులకు రక్షణ కల్పించాలని కోరారు. ఆస్పత్రిలో అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని ఇద్దరిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మహమద్ యాష్, రావన్న, కుమారి, సత్య, తులసీభారు, వెంకటమ్మ, చిన్న, క ష్ణ, శివ, రాము, శ్రీను పాల్గొన్నారు.