Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉస్మానియాయూనివర్సిటీ
రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని కాపాడాలని ప్రొఫెసర్ కృష్ణారావు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం ఓఎస్డీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హాజరైన ఓయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్ చంద్రునాయక్ మాట్లాడుతూ రక్తదానం చేయడాన్ని యువత అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసిన విద్యార్థులనునాయన అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాములు, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పరంధాములు, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి డాక్టర్స్ అరుణ, సంగీత, కౌన్సిలర్ సువర్ణకుమారి, ఆర్ట్స్ కళాశాల ఎఆర్ ఖాజా, బాలకృష్ణ, సీనియర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యాసాగర్, మాలోతు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 50 మంది విద్యార్థులు శిబిరానికి హాజరై రక్తదానం చేశారు.