Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ధర్నా
- పలువురు నేతల అరెస్టు
నవతెలంగాణ - కేపీహెచ్బీ
పేదలు నివాసముంటున్న గుడిసెలను కూచ్చిన హౌసింగ్బోర్డు అధికారులు తక్షణమే వారికి ప్రత్యామ్నాయం చూపాలని సీపీఐ(ఎం), టీమాస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆయా ప్రజాసంఘాల నేతలు ర్యాలీ న్విహించి కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారిని కేపీహెచ్బీ పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ 15 ఏండ్లుగా రమ్యా గ్రౌండ్స్ వెనుకగల దోబీఘాట్ ప్రాంతంలో నిరుపేదలు గుడిసెలు వేసుకుని దినససరి కూలీలుగా పనిచేస్తూ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా అకారనంగా వారి గుడిసెలు కూల్చేసి నిరుపేదల కుటుంబాలను రోడ్డున పడేశారని ఇది ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ రద్దుకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతినివేదన సభకు తరలించిన స్థానిక నాయకులు, ఎన్నికల సమయంలో ఓట్లకోసం మాగుడిసెల చుట్టూ తిరిగిన నేతలు గుడిసెవాసులకు న్యాయం జరిగేవరకు వారికి అండగా నిలిచి తక్షణమే వారికి రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇండ్లల్లో ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రవీణ్, కృష్ణానాయక్, చంద్రశేఖర్, సంపత్కుమార్, బాధితులు వెంకటేశీ, లక్ష్ష్మి, వెంకయ్య, లక్ష్ష్మీనారాయణ పాల్గొన్నారు.