Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మీర్పేట
మదరిండియా స్మోర్ట్ లిపింగ్ కార్యక్రమం గురువారం మీర్పేట శ్రీచైతన్య హైస్కూల్లో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిధిగా హాజరైన మీర్పేట ఎస్ఐ మహబూబ్అలీ, ప్రిన్సిపాల్ సురేష్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేష్కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. యువతను తప్పుదారి పట్టించే డ్రగ్స్ , మద్యం, సిగరెట్లు, అవినీతి వంటి వాటిని నిర్మూలించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇంకా ఈ కారక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, డీన్ మహమ్మద్ రఫీ, ఎవో శ్రీకాంత్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.