Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తున్న రాజభాష సప్తాహా సమారోV్ా-2018లో భాగంగా సికింద్రాబాద్ రైల్ నియలం ఆడిటోరియంలో బుధవారం రాత్రి హిందీ హాస్య కవి సమ్మేళనం జరిగింది.
సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం వీఏ.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్ఎం శైలేంద్ర సింగ్, మరో అదనపు డీఆర్ఎం (జనరల్) కే.బాలసుబ్రహ్మణ్యం అతిథిలుగా హాజరుకాగా రైల్వే అధికారులు, సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిలాస్పూర్ నుండి విచ్చేసిన ప్రముఖ హిందీ కవి రాజేంద్ర మౌర్య అనేక హిందీ కవితలను వినిపించి సభను నవ్వుల వానలో ముంచెత్తారు. సెక్రెటరీ (పబ్లిక్ గ్రీవెన్షెన్) ఏకే.సింగ్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ విక్రంగుప్త, ఎల్కే.పాండే, అమన్దీప్ కపూర్, నాందేడ్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ అనురాగ్ మాథుర్, రాం పవిత్ర సింగ్, ఎం.యూసూఫ్ పాల్గొని తమ కవితలతో, ఛలోక్తులతో సభాసదులను హాస్యరసంలో ఓలలాడించారు.
ప్రకృతి, ప్రేమ, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి తదితర అంశాలపై హిందీ కవుల కవితా పఠనాలు అదృంతం నవ్వుల పూలు పూయించాయి. తరువాత జోన్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే హిందీని ప్రొత్సహించటానికి కృషి చేసిన 375 మంది రైల్వే సిబ్బంది, 40 మంది అధికారులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. సీనియర్ రాజభాష అధికారి ఎకే.మండల్ వార్షిక నివేదికను సభకు సమర్పించారు.