Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెచ్చులూడుతన్న కాచవాని సింగారం పాఠశాల
- పట్టించుకోని అధికారులు
- ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు వివాజీ నాయక్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కాచవాని సింగారంలోని ప్రభుత్వ పాఠశాల పూర్తి శిథిలావస్థకు చేరి విద్యార్థులకు ప్రమాదకరంగా మారింది. అయిన అధికారులు పట్టించుకోవడం లేదని ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు నానావత్ శివాజీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎన్ఎస్యూఐ నాయకులతో కలిసి కాచవాని సింగారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైకప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతుందని, ప్రభుత్వానికి ఇలాంటి పాఠశాలలను పట్టడం లేదని విమర్శించారు. ఏలాంటి ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.