Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో నిర్దేశిత 40లక్షల మొక్కలతో పాటు అదనంగా మరో ఐదు లక్షలు నాటాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గురువారం అర్బన్ బయోడైవర్సిటీ అధికారులతో సమావేశమైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో హరితహారంపై సమీక్షించిన కమిషనర్, ప్రస్తుత హరితహారంలో 40లక్షల మొక్కలను నాటడం, ఉచితంగా పంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకుందని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 38,03,910 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా నగరంలో ఉన్న ఖాళీ స్థలాల్లో, సంస్థల్లో ఐదు లక్షల మొక్కలను నాటాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,04,766 మొక్కలను నాటడం జరిగిందని పేర్కొన్నారు. వీటికి అదనంగా ఐదు లక్షల మొక్కలను నాటాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేస్తూ వర్షాలు ముగిసేలోపే వీటన్నింటిని నాటాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నాటిన మొక్కల్లో చనిపోయినవాటి స్థానంలో కొత్త మొక్కలను నాటాలని పేర్కొన్నారు.