Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
పద్మభూషణ్ డాక్టరు ఏఎస్రావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసీఐఎల్ కమిటీ ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి ఈసీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ రియర్ అడ్మిరల్ రిటైర్డ్ సంజరు బోబే ఫైనాన్స్ డైరెక్టర్ కిషోర్ రంగ్ట, ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షకార్యదర్శులు సీహెచ్భాస్కర్రెడ్డి, నర్సింహాలు కలిసి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు. అలాగే ఈసీఐఎల్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి సోహాను కూడా నివాళ్లర్పించారు.
ఈ సందర్భంగా ఈసీఐఎల్ ఎండీ మాట్లాడుతూ ఏఎస్రావు గొప్ప జాతీయవాది అని ఈ దేశాన్ని ముందుండి నడిపించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అహర్నిషలు కృషి చేసి ఈసీఐఎల్ సంస్థను స్థాపించారని అన్నారు. దేశ పురోభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.
ఏఎస్రావునగర్లో నివాళ్లర్పించిన నాయకులు, కాలనీవాసులు
ఏఎస్రావునగర్ కాలనీలోని ఆయన విగ్రహానికి కాలనీ అసోసియేషన్ కార్యదర్శి సోమయ్యచారి, మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు, కార్పొరేటర్ పావనిమణిపాల్రెడ్డి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఏఎస్రావు పేరుతో ఏర్పడిన కాలనీ ఇంకా అభివృద్ధి సాధిస్తుందని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని అన్నారు.
ఏఎస్రావునగర్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో..
కమలానగర్లోని సీఐటీయూ కార్యాలయంలో పద్మభూషణ్ 104వ జయంతి సందర్భంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలామాల వేసి నివాళ్లర్పించారు.
ఆయన సేవలను కొనియాడుతూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షకార్యదర్శులు యాదిగిరిరావు, పీవీ.చారి, ఏఎస్రావునగర్ సొసైటీ కార్యదర్శి సోమయ్యచారి, ఈసీఐఎల్ యూనియన్ మాజీ నాయకులు ఎస్ఆర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.