Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవజ్యోతి విద్యా సంస్థల చైర్మన్ మలిరెడ్డి ఇందిరారెడ్డి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
చిన్నారులపై ఆకృత్యాలు, భ్రూణ హత్యలు, ఆడ శిశువులపై హత్యలు జరగకుండ కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని మరోమారు చేయకుండా పెద్ద శిక్ష విధించాలని నవజ్యోతి విద్యాసంస్థల చైర్మన్ మలిరెడ్డి ఇందిరారెడ్డి అన్నారు. ప్రజల్లో చైతన్యం తేవాలని భాగంగా తమ వంతు బాధ్యతగా గురువారం పట్వారీ ఎన్క్లేవ్లోని నవజ్యోతి హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పూరవీధుల్లో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ దేశంలో నిత్యం మహిళలపై , చిన్నారులపై అకృత్యాలు జరుగుతునే ఉన్నా యని, నిర్భయ, అభయ చట్టాలు కూడా పూర్తి స్థాయిలో వారిపై ప్రభావం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన శిశువు హత్యలు, భ్రూణ హత్యల కారణంగా నానాటికి స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత సమాజంలో తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరకశంగా ప్రవర్తించే వారిని ఉరి శిక్ష వేసే విధంగా సమాగ్ర చట్టం తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.