Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్చరల్ రిపోర్టర్
శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బా రావు కళావేదికపై ఆకాంక్ష ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేరళ వరద బాధితుల సాహా యార్ధం ఛారిటీ షో నిర్వహించారు. వేణు గోపాల్ పేరడి పాటలు, బైరి శ్రీనివాస్ సినీ గీతాలు, మల్లేలసుధాకర్, కె నరేష్ల మిమిక్రీ, బుర్ర మోహన్కృష్ణ, ఎంవి సుబ్రమణ్యం హాస్య వల్లరి, వర్షిత్ ఇంద్రజాల ప్రదర్శన, శర్మిల భక్తి గీతాలపన ఆకట్టుకున్నాయి. అతిథులుగా భారత్టుడే టివి న్యూస్ ఎడిటర్ జి వల్లేశ్వర్, సంఘసేవకులు ఎ విజరుకుమార్, గాయకుడు త్రినాధరావు పాల్గొని మాట్లాడుతూ మనిషి మనిషిగా ఎదగడానికి మావత ముఖ్యమన్నారు. ఆపదలో ఉన్న తోటి వారిని ఆదుకోవడానికి సాంస్కృతిక సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సంస్థ స్థాపకురాలు జర్నలిస్ట్ పి. సంధ్యారాణి మాట్లాడుతూ ఛారిటీ షో ద్వారా వసూలైన మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. రఘుశ్రీ సమన్వయం చేశారు.