Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్చరల్ రిపోర్టర్
నటిగా, నిర్మాతగా కృష్ణవేణి అలనాటి అగ్రేసర సినీ ప్రముఖుల్లో ఒకరని తమిళనాడు పూర్వ గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య కొని యాడారు. యువకళావాహిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గురువారం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం కృష్ణ వేణికి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వ హించారు. ముఖ్య అతిథిగా రోశయ్య పాల్గొని పురస్కారాన్ని బహూకరించి మాట్లాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎందరో ప్రతిభ వంతులైన కళాకారులను కృష్ణవేణి అందిం చారని తెలిపారు. పారిశ్రామికవేత్త సారిపల్లి కొండల్రావు అధ్యక్షత వహించిన సభలో ప్రముఖ నటి జమున ప్రసాద్ మల్టీప్లెక్స్ అధి నేత ఎ రమేష్ప్రసాద్, సినీ నటీమణులు గీతాంజలి, కవిత ప్రముఖ నిర్మాత ఎన్ఆర్ అనురాధ, చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ, పద్మ శ్రీ పిక్చర్స్ అధినేత పద్మాభూపతి, తదితరులు పాల్గొన్నారు. వైకె నాగేశ్వరరావు స్వాగతం పలి కిన కార్యక్రమానికి లంకా లక్ష్మీనారాయణ వ్యా ఖ్యానం చేశారు. కార్యక్రమానికి తొలుత శారద ఆకునూరి (అమెరికా) బృందం పాడిన పాటలు శ్రోతలను రసానందంలో ముంచెత్తాయి.