Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్చరల్ రిపోర్టర్
చారిత్రిక వాస్తవాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉందని ప్రముఖ పాత్రికేయులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభలోని లలిత కళావేదికపై విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో గురు వారం ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన అమరావతి గ్రంథావిష్కరణ కార్యక్రమం నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొత్తూరి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ తెలుగు సాహి త్యంలో చారిత్రిక నవలల ఆవశ్యకత ఉంద న్నారు. ఇనాక్ అమరావతి చరిత్రపై పరిశోద నాత్మక వివరాలను అందించాన్నారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ సంపుటిలో అమరావతి విశేషాలను వివరిస్తూ తెలిపిన కవితలు కూడా ఆకట్టుకునేవిధంగా ఉన్నాయని తెలిపారు. విమర్శకుడు రమణ వెలమకన్ని అధ్యక్షత వహించిన సభలో గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి, సాంస్కృతిక ప్రియులు జి. వెంకటరెడ్డి, వై రాజేంద్రప్రసాద్, డాక్టర్ రజిని గంగాదర్ పాల్గొన్నారు. సభా కార్యక్రమానికి తొలుత పెద్దూరి వెంకటదాసు నిర్వహణలో కవి సమ్మేళనం జరిగింది. జల్ది విద్యార్ధరావు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.