Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీకాంత్
నవతెలంగాణ - శామీర్పేట
తనకు లభించిన ఉత్తమ అవార్డు ద్వారా బాధ్యత మరింత పెరిగిందని మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం అలియబాద్ విభాగం ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీకాంత్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్తమ సేవలందించినందుకుగాను కేంద్ర విద్యుత్తుశాఖ విధ్యుత్తుశాఖ మంత్రి చేతులమీదుగా సెప్టెంబర్17న అవార్డు అందుకున్నట్టు ఆయన వివరించారు. ఈ అవార్డు తనకు మరింత గుర్తింపు తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన సహచర ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.