Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ శామీర్పేట అధ్యక్షులు విష్ణుగౌడ్
నవతెలంగాణ - శామీర్పేట
నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని టీఆర్ఎస్ శామీర్పేట అధ్యక్షులు విష్ణుగౌడ్ అన్నారు. శామీర్పేట మండల కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తాలో బుధవారం టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు విష్ణుగౌడ్ ఆద్వర్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డిలు హజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్టాడుతూ... టీఆర్ఎస్ ప్రకటించిన పాక్షిక మేనిఫేస్టో తో నిరుపేదల సంక్షేమం, అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. గత ఎన్నికల్లో మేనిఫేస్టోలో పొందుపరచిన అంశాలనే కాకుండా కళ్యాణలక్ష్మీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మొదలైన పథకాలు ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదని వివరించారు. అదేవిధంగా ఇప్పుడు నిరుద్యోగభృతి, వికలాంగులకు, వృద్ధులకు ఇచ్చే పింఛను మరింత పెంపు, డబుల్ బెడ్ రూము ఇండ్లు, స్థలం ఉంటే ఇల్లు మంజూరు, రైతులకోసం రైతుబంధు పెంపు తదితర అంశాలు మేనిఫేస్టోలో పొందుపర్చడం హర్షణీయమని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల తరపున ఈ సందర్భంగా కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు చంద్రశేఖర్యాదవ్, గ్రంథాలయ చైర్మన్ భాస్కర్యాదవ్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, ఎఎంసి మాజీ చైర్మన్ సత్యనారాయణ, మద్దుల శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచులు ఎద్దు నాగేశ్యాదవ్, కమటం క్రిష్ణారెడ్డి, తాళ్ళ జగదీష్గౌడ్, మంద స్వామి, మధుకర్రెడ్డి, సతీష్రెడ్డి, పవన్ తదితరులు పాల్గోన్నారు.