Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
బతుకమ్మ ఉత్సవాలు మన సంస్కతీ, సంప్రదా యాలకు ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే రామ్మోహ న్రెడ్డి అన్నారు. బుధవారం పరిగిలోని ఆయన నివాసంలో వారి సతీమణి ఉమా రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ చీరలు కట్టుకొని పాట పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఉమా రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ మహిళలు పూర్వకాలం నుండి బతుకమ్మ పండుగను జరుపుకుం టున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను తామే తీసుకు వచ్చినట్టు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు కూడా బతుకమ్మ పండుగలు జరుపుకున్నామని గుర్తు చేశారు. కార్య క్రమంలో గండీడ్ మండల ఎంపీపీ శాంతాబాయి, కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘ మాల, సురేఖ రెడ్డి, రజిత రెడ్డి, పరిగిలోని మహిళలు పాల్గొన్నారు.