Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బుధవారం తెల్లవారు జామునుంచి పాతబస్తీలో ఎడతెరపి వర్షం కురుస్తుండటంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ముందస్తు ఎన్నికలు రావటంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించలేదు. గత నెల 8న తమ అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులు ఆ మరుసటి రోజు నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే బుధవారం తెల్లవారు జామునుంచి రాత్రి వరకు పాతబస్తీలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. అభ్యర్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారాన్ని బయలుదేరేందుకు సిద్ధపడగా కార్యకర్తలు, ముఖ్యనేతలు, కార్పొరేటర్లు ఇండ్లల్లోనే ఉండిపోవడంతో చేసేదిలేక ప్రచారాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మధ్యాహ్నం కొద్ది సేపు వర్షం తెరపి ఇవ్వడంతో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు అహ్మద్ బాలాల, అహ్మద్ పాషాఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ఖాన్ తమ తమ సెంగ్మెంట్ల పరిధిల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతలోనే మళ్లీభారీ వర్షం కురవడంతో పాదయాత్రలకు బ్రేక్ వేసుకున్నారు. వర్షం కారణంగా ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రాలేదు. కనీసం తలుపులు సైతం తెరవక పోవడంతో అభ్యర్థులు చేసేదిలేక ఇండ్లకు వెళ్లిపోయారు. టీఆర్ఎస్, ఎంబీటీ అభ్యర్థులు కూడా ప్రచారాన్ని ఆపేసి ఇండ్లకు వెళ్లిపోయారు.