Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంబర్పేట
అంబర్పేట మహంకాళి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు దేవస్థాన సేవా సమితి ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు అలం కరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో హోమాలు, సామూహిక కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. పూజా కార్యక్రమంలో అంబర్పేట దేవస్ధాన సేవాసమితి ప్రతినిధులు దుర్గా ప్రసాద్రెడ్డి, గడ్డం లక్ష్మణ్గౌడ్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్, మోర శ్రీరాములు ముదిరాజ్, రంగంపల్లి రాజు, వి.మహేందర్రెడ్డి, గడ్డం శ్రీధర్గౌడ్, కంచె మహేష్, సి.హెచ్.సుధాకర్, ఎం.బోగరాజ్, జి.కృష్ణగౌడ్, మెట్టు ధన్రాజ్, బింది రాజుగౌడ్, ఎన్.జలందర్, తదితరులు పాల్గొన్నారు.
నేడు దసరా సమ్మేళనం, రావణాసుర దహన కార్యక్రమాలు...
అంబర్పేట దేవస్ధాన సేవా సమితి ఆధ్వర్యంలో జంటనగరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో దసరా సమ్మే ళనం, రావణాసుర దహన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యంగా రాజమండ్రి వారు తయారు చేసిన బాణాసంచా పెద్ద ఎత్తున కాల్చనున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహి స్తారు. ఈ కార్యక్ర మానికి రాష్ట్ర మాజీ మంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ, మాజీ శాసన సభ్యులుల జి.కిషన్రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, కార్పొరేటర్ కె.పద్మావతిరెడ్డి హాజరుకానున్నారు.