Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ కుత్బుల్లాపూర్
ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానంద్
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
అందరి సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ పని చేస్తోందని టీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.వివేకానంద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతల్ డివిజన్ పరిధిలోని వల్లబారుపటేల్నగర్లో డివిజన్ టీిఆర్ఎస్ అధ్యక్షులు మహమ్మద్రఫి ఆధ్వర్యంలో వివేకానంద్ ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్టు చెప్పారు. తాము చేసిన అభివృద్ధే గీటురాయి అని తెలిపారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు వాహీద్ ఖురేషి, నాయకులు నర్సింహాయాదవ్, మక్సూద్, జహంగీర్, బషీర్, నాగిరెడ్డి, శేఖర్, సంపత్యాదవ్, ఆహ్మాద్, అంజద్ పాల్గొన్నారు.
వివేకానంద్ను సన్మానించిన
ఆర్యవైశ్య సంఘం సభ్యులు
కుత్బుల్లాపూర్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో నిజాంపేట్, చింతల్కు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం వివేకానంద్ను చింతల్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నంబర్ వన్గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో వివేకానంద్ను గెలిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్గుప్త, ప్రభాకర్, చైతన్య, కృష్ణ, వెంకట్రత్నం, సురేష్, రామ్మూర్తి, నర్సయ్య పాల్గొన్నారు.