Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 276 మందికి అందజేసిన కమిషనర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూలై నుంచి అక్టోబర్ మాసాల్లో విధుల్లో ప్రతిభ కనబర్చిన 276 మంది పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ రివార్డులు అందజేశారు. బుధవారం కమిషన రట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్ర మంలో లా అండ్ ఆర్డర్, సీసీఎస్, ఎస్బీ, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ఐటీ సెల్, భరోసా కేంద్రంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకూ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ షీకాగోయేల్, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతీ పాల్గొన్నారు