Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంబర్పేట
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 22 ఏండ్ల వయసులో ఎన్కౌంటర్లో మరణించిన మల్లేషంగౌడ్ జ్ఞాపకార్థంగా ఆదివారం బాగ్అంబర్పేట డివిజన్ సీఈ కాలనీలో కార్పొరేటర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట ఇన్స్పెక్టర్ టి.మురళీకృష్ణ, మల్లేశంగౌడ్ సోదరుడు సతీష్గౌడ్ హాజరై 500 మొక్కలను సీఈ కాలనీవాసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు వెంకట్రావు, సుధాకర్, శర్మ తదితరులు పాల్గొన్నారు.