Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ హాజరుకానున్న ఓయూ ప్రొఫెసర్ పార్థసారథి
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో జీస్ఫ్యాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో ''డిజిటల్ యుగంలో మారుతున్న నగర ప్రమాణాల పెంపుదల'' అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఓయూ ప్రభుత్వ పాలన శాస్త్రం, ఆర్సీయూఈఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై.పార్థసారథి హాజరుకానున్నారు. ఆయన ప్రసంగంతోపాటు ఒక సెక్షన్కు అధ్యక్షత వహించనున్నారు. అనంతరం జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పార్థసారథి పర్యటించి, పలు వర్సిటీలను సందర్శించనున్నారు. గతంలో పలు దేశాల్లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.