Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ ప్రజా స్వరాజ్యం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుభాష్
నవతెలంగాణ - అంబర్పేట
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజా స్వరాజ్యం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టెల సుభాష్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లకుంట డివిజన్ పరిధిలోని నర్సింహా బస్తీలో ప్రజా స్వరాజ్యం పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అర్హులైనవారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చినంక మాట మర్చాడం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరోసారి ప్రజలను మభ్య పెట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీన్ని ప్రజలంతా గమనించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గంలో ప్రజా స్వరాజ్యం పార్టీ జెండా ఎగురవేయాలని, అందుకు కార్యకర్తలంతా కలిసి పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శ్రీరాములు, సుధాకర్, లక్ష్మణ్, మధు, శ్రీను, పలువురు నాయకులు పాల్గొన్నారు.