Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
ఈనెల 26 నుంచి 28 వరకు నగరంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ వర్సిటీలో ఏఐయూఈసీ 13వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నామని తుంటియా రాష్ట్ర అధ్యక్షులు బియ్యాని జ్ఞానేశ్వర్, కన్వీనర్ సామ అమృతరెడ్డి, మోహన్గౌడ్, డాక్టర్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ''ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ నేపథ్యంలో ఉన్నత విద్యారంగం పరిస్థితులు - ప్రభావం- సమస్యలు - పరిష్కారం'' అనే అంశంపై జాతీయ సెమినార్తో మహాసభలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సెమి నార్కు ముఖ్యఅతిథులుగా మండల చైర్మన్ స్వామిగౌడ్, వీసీ, డాక్టర్ ప్రవీణ్రావు హాజరవుతారని, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కీలక ఉపన్యాసం చేస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీల నుంచి వెయ్యి మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఏపీ, తెలంగాణ నుంచి 15 మంది వీసీలు, రిజిస్ట్రార్లు రానున్ననట్టు తెలిపారు. ఒకవైపు తెలుగు రాష్ట్రాల వీసీలను ఆహ్వానిస్తూ మరోవైపు నిధుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని చెప్పారు.