Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
- అ టీమాస్ చైర్మన్ కంచ ఐలయ్య
నవతెలంగాణ - జూబ్లీహిల్స్
కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, మళ్లీ ముందస్తు ఎన్నికల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని టీమాస్ చైర్మన్ కంచ ఐలయ్య అన్నారు. బోరబండ సైట్-3లో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఆదివారం నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథులుగా బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, కంచ ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయ డంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫమైం దన్నారు. కేసీఆర్ మాయమాటలను ప్రజలు నమ్మరని చెప్పారు. మరోసారి డబ్బుతో ఓటర్ల ను కొని అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఎఫ్ అధికారం లోకి వస్తేనే బహుజనుల బతుకులు బాగుపడు తాయని చెప్పారు. బోరబండలో బీఎల్ఎఫ్ బలపర్చిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించా లని కోరారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లడుతూ ఎక్కువ మంది పేదవారు నివసిస్తున్న ఏరియా బోరమండ అని, ఇక్కడ మొట్టమొదటి ఎన్నికల సభ నిర్వహించుకో వడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకాలం అగ్రవర్ణ వారే రాజ్యాధికారం చేపట్టారని, వారి పాలనలో బహుజనులకు న్యాయం జరుగలే దని గుర్తు చేశారు. మన సమస్యలన్నీ తీరాలం టే.. బీఎల్ఎఫ్ అభ్యర్థిని గెలిపించాలని కోరా రు. అంతకుముందు 500 మందితో యూసు ఫ్గూడ, రహమత్నగర్, మోతీనగర్ మీదుగా అభ్యర్థిపాటు నాయకులు, కార్యకర్తలంతా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మోతీనగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ కన్వీనర్ డిజి నరసింహారావు, సీపీఐ(ఎం) సిటీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదిరులు తెలిపారు.