Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ తాగునీటితో డ్రయినేజీ మురుగునీరు కలుషితమై పురుగులు తయారవుతున్నాయి. ఆ నీటినే నల్లాలకు పంపుతున్నారు. ఆ నీరు తాగి ప్రజలు అనారోగ్యా బారీన పడి అవస్థలు పడుతున్నారు. ఆ ట్యాంక్ నిర్మించి 11 ఏండ్లు గడుస్తున్న ఇప్పటికీ శుభ్రం చేయలేదు. కలుషిత నీటిని తాగి ప్రజలు రోగాల పలైతే పట్టించుకునే నాథుడే లేడని కాలనీవాసులు వాపోతున్నారు. ట్యాంక్ చుట్టు మురుగు, చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుంటే సంబంధిత అధికారులు కన్నెతైన చూడటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నవతెలంగాణ-చంపాపేట
మురికి కూపంగా
అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్
తాగునీటిలో పురుగులు
అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు
ఏండ్లు గడిచినా ట్యాంక్ శుభ్రం
చేయరా..? : కాలనీవాసులు
సైదాబాద్ మండలం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో ఉన్న సింగరేణికాలనీ ఉంది. ఈ కాలనీలో 20 ఏండ్ల క్రితం ఇతర రాష్ట్రలు, జిల్లాల నుంచి పేదలు వచ్చి జీవిస్తున్నారు. ఇక్కడ సుమారు 4500 కుటుంబాలు నివాసముంటున్నాయి. అప్పట్లో చిన్న పాటి గుడిసెలు ఏర్పాటు చేసుకుని జీవనంకొనసాగించారు. అయితే 2005లో ఒకరోజు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి గుడిసెలన్ని దగ్దమయ్యాయి. వారంత నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదంలో వికలాంగుడు, చిన్నారి, వృద్ధుడు మృతిచెందారు. ఈ ఘటనపై అప్పట్లో నగరంలో పెద్ద సంచలనంగా మారింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి స్పందించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. వారికి వాంబే గృహాలు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు 2007లో ఏడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో 17వందల కుటుంబాలకు వాంబే బిల్డింగ్స్ నిర్మించారు. ఇండ్ల నిర్మాణంతో పాటు తాగునీరు అందించేందుకు అక్కడ అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఈ ట్యాంక్ ద్వారా బిల్డింగ్స్లోని ప్రజలు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ బిల్డింగ్ బాధ్యతలు జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, విద్యుత్ విభాగాలకు అప్పగించారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వాంబే గృహాలను పట్టించుకునేవారు ఎవరూ లేరు..
వాంబే గృహాలు నిర్మించి 11 ఏండ్లు పూర్తి కావస్తుంది. అక్కడి డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీరు కాలనీ విధుల్లో ప్రవాహిస్తు దుర్వాసన వెదజల్లుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ తెగిపోయి మీటర్ల వద్ద వెల్లాడుతున్నాయని తెలిపారు. వాటర్ ట్యాంక్ అపరిశుభ్రంగా మారి దుర్గందంగా తయ్యారయిందని పలువురు తెలిపారు. ట్యాంక్ చుట్టు డ్రయినేజీ మురుగు నీరు చేరి ట్యాంక్ నీరు కలుషితమై నీటిలో పరుగులు తయ్యారవుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తంచేశారు. ట్యాంక్ దగ్గరకు వెళ్లేందుకు వీలులేకుండా పిచ్చి మొక్కలు, మురుగునీరుతో అస్తవ్యస్తంగా తయారయ్యింది. అక్కడ ఈగలు, దోమలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయిని ప్రజలు తెలిపారు. దాంతో కాలనీ వాసులు రోగాల బారీన పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు అట్టువైపు కన్నేతైన చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యల పరిష్కరించాలని కోరుతున్నారు. మరి అధికారుల ఏ మేరకు స్పందింస్తారో వెచి చూడాల్సిందే..
ట్యాంక్ను శుభ్రం చేయడంలేదు : స్థానికురాలు అరుణ
బిల్డింగులు, వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటి నుంచి ఇప్పడి వరకు ట్యాంకును ఎవరూ శుభ్రం చేయలేదు. ట్యాంక్ వద్ద మురుగు నీరు, చెత్తచేదారంతో దుర్వసన వస్తుంది. అధికారులు ఒక రోజు కూడా ఇటువైపు కన్నేతైన చూడాలేదు. తమ కాలనీలో అడుగు పెడితే చాలు అన్నీ సమస్యలే. ఇప్పటికైన అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను.
పురుగులు వస్తున్నాయి : స్థానికురాలు జంగమ్మ
ట్యాంక్ నుంచి సరఫరా చేసే తాగునీటిలో పరుగులు, దుర్వాన వస్తుంది. ఆ నీటితో వంట చేసుకోవలంటే భయం వేస్తుంది. కొన్ని పురుగులు కంటికి కనపడక తాగితే రోగాల బారిన పడుతున్నాం. అందుకే బయట నుంచి రూ.20లకు డబ్బా నీటికి చెల్లించి పిల్టర్ వాటర్ తెచ్చుకుంటున్నాం. నీరు ఎర్రగా వస్తుందని అధికారులకు చూపిస్తే వారు పైప్లైన్ పనులు జరుగుతున్నాయని అందుకే ఇలా వస్తున్నాయని తెలుపుతున్నారు. కొందరు వాటర్ వాల్ ఇప్పమంటే ఇప్పుతాం.. లేదంటే ఇప్పం.. మీరు బిల్లులు చెల్లించకపోతే ఇలాగే వస్తుందని బెధిరింపులకు గురిచేస్తున్నారు. ఈ సమస్యను అధికారులే పరిష్కరించాలి.
బిల్లులు తప్పించుకునేందుకే..
అంత బాగానే ఉంది. ఒక వాటర్ ట్యాంక్ చుట్టు చెట్లు మొలిచాయి. వాటిని తొలగించి వేస్తాం. ట్యాంక్ చుట్టూ సిమెంట్ వేయిస్తాం. బిల్డింగ్స్లో డ్రయినేజీ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. మురుగు నీరంత ట్యాంక్ చుట్టు పారుతుంది. డ్రయినేజీ సమస్య, ట్యాంక్ వద్ద శుభ్రం చేయిస్తే సమస్యల ఉండదు. స్థానికులే అక్కడ పనికిరాని చెత్తనంత వేసి అపరిశుభ్రంగా మారుస్తున్నారు. కాలనీవాసులే నీటి బిల్లులు చెల్లించకుండా ఉండేందుకే సమస్యలు వస్తున్నాయని బుకాయిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తే అ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయి.
- వైశ్యాలీనగర్ వాటర్బోర్డు డీజీఎం శ్రీనువాస్