Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
మల్లం రమేశ్ నిర్వహణలో ఆనంద లహరి సంస్థ ఆధ్వర్యంలో శ్రీత్యాగరాయ గానసభలోని కళాదీక్షితులు కళావేదికపై ఏడ్రోజుల పాటు సప్తకళా తరంగాలు పేరిట ఏడు కళాప్రక్రియలలో ప్రముఖులైన వారిని సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆదివారం ప్రముఖ సినీదర్శకుడు ముప్పలనేని శివ ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు ప్రాంతాలలో విస్తృతంగా కళాపోషన జరుగుతోందని ఇందుకు కారణం కళాసంస్థలే అన్నారు. వేదికపై చొక్కాపు రమణ, రఘుబాబు, బిఎస్ఎన్ కుమార్ పాల్గొన్నారు. మల్లం రమేశ్ మాట్లాడుతూ 33 కళాప్రక్రియలను ఏడ్రోజుల పాటు ప్రదర్శిస్తామని తెలిపారు.