Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మల్కాజిగిరి
ఏసీబీ అధికారిని అంటూ పలువురిని బెదిరిస్తూ మల్కాజిగిరి పోలీసులకు ఓ వ్యక్తి పట్టుబడిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ సందీప్కుమార్ నిందితుడి వివరాలను వెల్లడించారు. వాసుపల్లి జాన్ ప్రయివేటు సివిల్ కాంట్రాక్టర్గా హెచ్ఎంటీ, హనుమాన్టెంపుల్, చింతల్, కుత్భుల్లాపూర్, మేడ్చల్ జిల్లాలో పనిచేస్తుంటాడు. ఈ నెల 12న ఏసీబీ అధికారిని అని భానోతు లాల్సింగ్ సూర్యరమణి గ్రీన్హీల్స్కాలనీలో ఉండే వ్యక్తికి ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చి సోదాలు నిర్వహించాల్సి ఉందని ఫోన్ చేశాడు. అతనికి అనుమానమొచ్చి మల్కాజిగిరి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. ఏసీబీ దాడులు నిర్వహించకుండ ఉండాలంటే రూ. 50వేల రూపాయలు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. చాకచక్యంగా ఎస్ఐ అశోక్కుమార్ నిందితుని ఫోన్ ట్రాప్ చేసి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే ఫోన్ చేశానని అంగీకరిం చాడు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.