Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
అ భరత్రెడ్డి మృతదేహానికి నివాళ్లర్పించిన పలువురు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
లారీ ఢకొీని కీసర మాజీ వైఎస్ ఎంపీపీ భరత ్రెడ్డి మృతి చెందాడు. ఈ ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన బి.భరత్రెడ్డి (49)స్కూటీపై మార్నింగ్ వాకింగ్ కోసం కీసరగుట్ట దారిలో వెళ్తున్నారు. ఈ తరుణంలో గంగా భవాని రైస్మిల్ సమీపంలోకి రాగానే కీసర నుంచి వస్తున్న టిప్పర్ లారీ స్కూటీని వెనుక నుంచి ఢ కొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న భరత్రెడ్డి తలకు తీవ్రంగా గాలయ్యాయి. రోడ్డుపై వెళ్లేవారు ఇది గమనించి క్షతగాత్రున్ని ఈసీఐఎల్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రకాశ్ తెలిపారు.
శోకసంద్రంలో కుటుంబం..
కీసర మాజీ వైస్ ఎంపీపీ బి.భరత్రెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే భరత్రెడ్డి ఇకలేరు లేని తెలియడంతో ఆయన భార్యా ఇద్దరు పిల్లలను మండలంలోని టీఆర్ఎస్ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓదార్చారు.
మృతదేహానికి పలువురి నివాళ్లు..
భరత్రెడ్డి మరణవార్త తెలియగానే మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, టీిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్గౌడ్, హర్షవర్దన్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయ కులు టి.జంగయ్య యాదవ్, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నందారెడ్డి, కీసర ఎంపీపీ ఆర్.సూజాత, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కౌకుంట్ల చంద్రారెడ్డి, టీఆర్ఎస్ కీసర మండలాధ్యక్షుడు రవికాంత్, నాయకపు వెంకటేష్, ముప్పు రాంరెడ్డి నివాళ్లర్పించారు.