Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నిర్మల
నవతెలంగాణ - గచ్చిబౌలి
మధ్యాహ్న భోజనాన్ని పటిష్టంగా నిర్వహిం చేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.నిర్మల విమర్శిం చారు. మంగళవారం కూకట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు నెలలుగా బిల్లులు, మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక్కొక్క పాఠశాలలో 600 నుంచి 1200 వరకు విద్యార్థులు ఉంటారని, అప్పులు చేసి వీరికి మధ్యాహ్న భోజనం పెడుతున్నారని చెప్పారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల్లో కూరుకుపోయారని తెలియజేశారు. 2009లో గౌరవ వేతనం రూ.1000తో ప్రారంభించినప్పటికీ, ఇప్పటి వరకు దానిని పెంచలేదని తెలిపారు. మెనూ ఛార్జీలు అతి తక్కువ ఇస్తున్నారని, ఒక్కో గుడ్డుకు రూపా యిన్నర తక్కువ చేసి ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు చాలాచోట్టా కిచెన్ షెడ్లు లేవని, గ్యాస్కు సబ్సిడీ లేకపోగా వంట పాత్రలు, స్టౌ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. బాత్ రూములు కూడా శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉసురు పోసుకుని ఈ పథకాన్ని నడుపుతు న్నారని తెలిపారు. 2012లో కేంద్ర ప్రభుత్వం కిచెన్ షెడ్ల కోసం నిధులు కేటాయిస్తే, వాటి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల ఆ నిధులు వెనక్కి వెళ్లాయని చెప్పారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసి, ఈ పథకాలు మొత్తం ప్రయివేటు వాళ్లకు అప్పగిం చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలియ జేశారు. ఇప్పటికే పలుచోట్ల వాళ్లకు అప్పగిం చారని, ఆ ఆహారాన్ని విద్యార్థులు తినలేక పోతు న్నారని చెప్పారు. ఎక్కడికక్కడ వండి పెడితే పౌష్టికాహారం అందుతుందని తెలియజేశారు. కావున వెంటనే కార్మికుల సమస్యలు పరిష్క రించి పథకం సజావుగా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ల సాధన కోసం నవంబర్ 19న నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపా ధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు అంజమ్మ, కూకట్పల్లి సర్కిల్ అధ్యక్షురాలు ఇందిరమ్మ, నాయకులు రాజేందర్, సరస్వతి, యాదమ్మ, లక్ష్మి, సునీత, బుచ్చమ్మ, సావిత్రి పాల్గొన్నారు.