Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాంచందర్
నవతెలంగాణ - హయత్నగర్
హయత్నగర్ డివిజన్లోని బస్ డిపో వద్ద నిర్వహించే సభను అన్ని కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి సభను విజయవంతం చేయా లని బీఎల్ఎఫ్(బహుజన లెఫ్ట్ ఫ్రంటు) బలపరిచిన బీఎల్పీ ఎల్బీనగర్ అభ్యర్ధి మామిడి రాంచందర్ పిలుపునిచ్చారు. ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ.. బుధవారం మొదటగా బీఎల్ఎఫ్లో చేరికల కార్యక్రమం ఉంటుందని, తదనంతరం సభ ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బహుజనుల్లో కొంతమేర చైతన్యం వచ్చిందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏండ్లు గడిచినా రాజకీయంగా దళిత, గిరిజన, మైనార్టీలకు సమాన అవకాశాలు కల్పిం చడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యారని గుర్తు చేశారు. రాజకీయంగా వెనుకబడిన అన్ని తరగతుల కుల సంఘాల మేధా వులు, వివధ కుల వృత్తుల వారు, అధిక సంఖ్యలో సభలో పాల్గొనాలని కోరారు. ఒక దళిత బిడ్డకు ఎల్బీనగర్లో పోటీ చేయడానికి మీ ముందుకు వచ్చానని, తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.