Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరర్ రిపోర్టర్
వివిధ ప్రాంతాలకు చెందిన నాట్య ప్రక్రియలను ఒకే వేధికపై ప్రదర్శించేదుకు అవకాశం ఇచ్చి జాతి సమైక్యతను పెంపొందిస్తున్నారని ప్రముఖ కధక్ కళాకారుడు అంజిబాబు, కల్పశ్రీ సంస్థ నిర్వహకులను ప్రశంసించారు. శ్రీత్యాగరాయ గానసభలో 3 రోజుల పాటు కల్పశ్రీ ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ కల్చరర్ సెంటర్ నిర్వహించిన అంతర్జాతీయ శాస్త్రీయ నృత్యోత్సవాలలో ముఖ్య అతిథిగా అంజిబాబు పాల్గొని కళాకారులను సత్కరించారు. నాట్య గురువులు వాణి రమణ, దేవి గోవిందరావు, పాల్గొన్న సభకు యువ కళావాహిని స్థాపకుడు వైకే నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సంస్థ నిర్వహకుడు సుజేంద్రబాబు మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులతో పాటు విదేశాలలోను శాస్త్రీయ నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి కార్యక్రమంలో స్నేహా రామచంద్రం బృందం పీ సాయి నిహాంత్రి రెడ్డి(హైదరాబాద్) ప్రదర్శించిన కూచిపూడి నృత్యాంశాలు మనీష, అనుప్రభ, నిఖిత, కావ్య(చెన్నరు) రాధిక(బెంగుళూర్) నర్తించిన భరతనాట్యాంశాలు ఆకట్టుకున్నాయి.