Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బేడ బుడగ జంగాల హక్కుల దండు
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
ఎస్సీ కులాలు అంటే కేవలం రెండు కులాలే కాదని, ఎస్సీ ఉపకులాలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేశా యని బేడ బుడగ జంగాల హక్కుల దండు వ్యవ స్థాపక అధ్యక్షులు చింతల రాజలింగం, రాష్ట్ర అధ్య క్షులు తుర్పాటి హనమంతు అన్నారు. ఓయూలో బేడ బుడగ జంగాల హక్కుల దండు ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 లక్షల జనాభా ఉన్న ఎస్సీ ఉప కులాల అభివృద్ధిని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం తమను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ అంబేద్కర్ చెప్పినట్టు జనాభా దామాషా ప్రకారం పలు రంగాల్లో వాటా ఇవ్వాలన్నారు. ఎస్సీలకు 19 సీట్లు ఉంటే అందులో రెండు మాత్రమే ఉపకులాలకు ఇవ్వడం సరికాదన్నారు. మా వాటా ప్రకారం మాకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి.. ప్రత్యేక కార్పొ రషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏ పార్టీ తమకు న్యాయం చేస్తే వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపకులాల అధ్యక్షులు వీరేష్, బేడ బుడగ జంగం నేతలు బి.వెంకటేషం, వీరేశం, టి.శివశంకర్, భాస్కర్, వెంకటస్వామి పాల్గొన్నారు.