Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ర్యాగింగ్కు పాల్పడిన వారిపై చర్యలకు సిద్ధం
అ విద్యార్థులను గుర్తించిన అధికారులు
అ కౌన్సిలింగ్ ఇచ్చిన ఓయూ సీఐ
కదిలిన యంత్రాంగం
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
మంగళవారం నవతెలంగాణ దినపత్రికలో 'ఓయూలో చాపకింద నీరులా ర్యాగింగ్'కు ఓయూ ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు, ఓయూ పోలీసులు శరవేగంగా స్పందించారు. ఈ విషయమై కొంత కాలంగా కళాశాల యాంటి ర్యాగింగ్ కమిటీ, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ టీమ్గా ఏర్పడి బాలికల హాస్టల్తోపాటు బాలుర హాస్టళ్లలో పర్యటించారు. మొత్తం మీద 10 నుంచి 20 మందిని పలు ఆధారాలతో సహా గుర్తించినట్టు తెలిసింది. గడిచిన రెండు రోజులుగా ప్రిన్సిపాల్ సమీనా ఫాతిమా లేకపోవటం, రిపోర్ట్ సిద్ధమైన ఆమె వచ్చాక నేడో, రేపో సదరు విద్యార్థులపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ విషయమై ఓయూ వీసీ రామచంద్రం నిత్యం రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు.
భరోసా ఇస్తాం.. భయం వీడండి : ఓయూ వీసీ
ఈ విషయమై ఒకవైపు ఓయూ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్రెడ్డి కొంతమంది ఇంజినీరింగ్ విద్యా ర్థులతో మంగళవారం చర్చించారు. ర్యాగింగ్ ఎవరు చేస్తున్నారో చెప్పాలని, మీ పేర్లు గోప్యంగా ఉంచు తామని, పోలీసుల నుంచి భరోసాతోపాటు రక్షణ కల్పిస్తామని సీఐ హామీ ఇచ్చారు. మరోవైపు ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులపై చర్యలు తప్ప వన్నారు. విద్యార్థుల మధ్య విద్యాపరం, క్రీడల అంశాల్లో సహకారం తీసుకోవాలి కానీ ర్యాగింగ్ను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరం అన్నారు.