Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరర్ రిపోర్టర్
భద్రాచల రామదాసు 54 కీర్తనలను 108 మంది కళాకారులు, పదముద్రలతో హస్తచాలనంతో అభినయ ప్రధానంగా నర్తించి, ప్రేక్షకులను ముగ్ధులచేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భావనాలయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ 25వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నృత్యోత్సవం నిర్వహించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాల చారి పాల్గొని మాట్లాడుతూ... అద్భుతమైన కళా ప్రక్రియలు కాలం మారినా, తరాలు మారినా శాశ్వతంగా నిలిచే ఉంటాయన్నారు. త్యాగరాజు, అన్నమయ్యలంతా ప్రాముఖ్యం రామదాసు పొందలేదని తెలంగాణ ఆవిర్భాతం తరువాత ఆయన కీర్తనలను ప్రాచుర్యం కల్పించాలని ఉందన్నారు. సాహితీవేత్త మృత్యుంజయ శర్మ తదితరులు పాల్గొన్న సభకు సంస్థ నిర్వహకుడు డాక్టర్ వట్టికోట యాదగిరాచార్య తమ శిష్య బృందంతో కలిసి తండ్రి వట్టికోట రామానుజాచార్యులకు గురువులు మంజుల, యశోద, కృష్ణమాచార్య, చింతా ఆదినారాయణ శర్మ, డాక్టర్ సువర్చలను సత్కరించారు. మధ్యాహ్నం కార్యక్రమంలో భక్త రామదాసు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మమ్మ, కర్ణారావు, డాక్టర్ వెంకటేశ్వపురావు పాల్గొనగా ముగింపు సభలో బీఏవీ రీజినల్ డైరెక్టర్ సీతాకిరణ్, వైఈపీ చైర్మన్ నర్సింహమూర్తి, కే.శేశాచార్య, ఎం.నర్సింహమూర్తి పాల్గొన్నారు. గురువులు యాదగిరాచార్య , జ్యోతి, సునీత, శ్రీతజ, భవానీలు తమ శిష్య బృందంతో కలిసి చేసిన నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి.