Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం అసమ్మతి వర్గ నాయకులు
నవతెలంగాణ - తుర్కయంజాల్
టీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ఓటమి కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తామని టీఆర్ఎస్ అసమ్మతివర్గం నాయకులు తెలిపారు. మన్నెగూడలోని టీఆర్ఎస్ నాయకులు కంచెర్ల చంద్రశేఖర్రెడ్డి మంగళవారం నివాసంలో మహాకూటమి నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమ నాయకులను విస్మరించిన మంచిరెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నియంత పోకడలను ఎండగట్టారు. మహాకూటమి నుంచి ఎవరు పోటీలో ఉన్నా వారి గెలుపునకు కృషిచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కంచెర్ల చంద్రశేఖర్రెడ్డి, జక్కిడి రాంరెడ్డి, ఈ.సీ శేఖర్గౌడ్, ధన్రాజ్గౌడ్, టీడీపీ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంగరి విష్ణువర్థన్రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు బిందు రంగారెడ్డి, పాష, సీపీఐ హయత్నగర్ మండల కార్యదర్శి ముత్యాల యాదిరెడ్డి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.